Headlines

బెంగళూరులో మాజీ కర్ణాటక డీజీపీ ఓం ప్రకాశ్ హత్య – భార్యను విచారణకు పోలీసుల అదుపులోకి

బెంగళూరు | ఏప్రిల్ 21, 2025: మాజీ కర్ణాటక డీజీపీ ఓం ప్రకాశ్ (68) ఆదివారం బెంగళూరులోని హెచ్‌ఎస్‌ఆర్ లేఅవుట్‌లోని తన నివాసంలో హత్యకు గురయ్యారు. ఆయన భార్య పల్లవిని ప్రధాన అనుమానితురాలిగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

పోలీసుల కథనం ప్రకారం, కుటుంబ ఆస్తులపై వివాదం నేపథ్యంలో భార్య భర్త మధ్య వాగ్వాదం తలెత్తింది. ఈ క్రమంలో పల్లవి మిర్చి పొడి వేసి, ఓం ప్రకాశ్‌ను కట్టేసి, కత్తితో పలు మారు పొడిచినట్లు సమాచారం. అనంతరం ఆమె ఒక స్నేహితుడికి వీడియో కాల్ చేసి, “మోన్స్టర్ను చంపేశాను,” అంటూ చెప్పినట్లు తెలిసింది.

ఓం ప్రకాశ్ 1981 IPS బ్యాచ్‌కు చెందినవారు. 2015 నుండి 2017 వరకు డీజీపీగా సేవలందించారు. ఫైర్ అండ్ ఎమర్జెన్సీ సర్వీసెస్, హోం గార్డ్స్ వంటి విభాగాల్లో కూడా పనిచేశారు.

అపఘాత సమయంలో వారి కుమార్తె కృతీ కూడా ఇంట్లో ఉండగా, ఆమెను కూడా విచారణకు తీసుకెళ్లారు. ఓం ప్రకాశ్ కుమారుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా, గతంలో తన తండ్రికి ప్రాణహానీ బెదిరింపులు వచ్చాయని, తల్లి మరియు చెల్లెలు తరచూ గొడవ పడతారని ఆరోపించారు.

ప్రస్తుతం కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగుతున్నట్టు పోలీసులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *